కంటెంట్ లేని సినిమాకు.. ఇంత హైప్ అవసరమా?: శ్రీరెడ్డి

  • ప్రేక్షకులను మెప్పించలేకపోయిన 'లైగర్'
  • అన్నీ ఫ్లాప్ సినిమాలు తీస్తాడంటూ పూరీపై శ్రీరెడ్డి విమర్శలు
  • మహేశ్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడమేంటోనని ఎద్దేవా
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తాజాగా నటి శ్రీరెడ్డి కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో అసలు కంటెంటే లేదని... కంటెంట్ లేని సినిమాకు ఇంత హైప్ అవసరమా? అని ఎద్దేవా చేసింది. 

అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ పై శ్రీరెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీసేవన్నీ ఫ్లాప్ సినిమాలేనని... అయినా, మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటో అని విమర్శించింది. మహేశ్ డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sri Reddy
Liger Movie
Puri Jagannadh
Vijay Devarakonda
Mahesh Babu

More Telugu News